శుక్రవారం ఇంట్లో అమ్మవారిని ఇలా పూజిస్తే డబ్బు డబ్బే..

-

మనం ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో ఉండటం లేదు అని చాలా మంది అనుకుంటారు..ఎలా పోతుందో తెలియకుండా పోతుందని అనుకుంటారు.అందుకు కారణం కూడా లేక పోలేదు..వరాల తల్లి ధన లక్ష్మి అమ్మవారి కటాక్షం లేక పోవడం వల్లే డబ్బులు నిల్వలేదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం నాడు కొన్ని నియమాలతో పూజిస్తే పోగొట్టుకున్న సిరి సంపదలు వస్తాయని అంటున్నారు.

అమ్మవారిని శుక్రవారం ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు లేదా ఎరుపు, లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆపై అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి.నేతితో దీపం వెలిగించడం మరిచిపోకూడదు. తద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

శుక్రవారం అమ్మవారికి తెల్లనిపువ్వులు అంటే జాజిపువ్వులు, మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలు చేకూరుతాయి. పాలతో పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. శుక్రవారం విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే.. గరికమాల తీసుకెళ్లడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మీకు వీలైతే 10 మంది ముత్తైదువులకు పసుపు,కుంకుమలను వాయినంగా ఇవ్వడం మంచిది.పూజ చేస్తున్న మహిళలు పసుపు కుంకుమలతో నిండుగా పెద్ద ముత్తైదువుగా మారి చేయడం మంచిదని పెద్దలు అంటున్నారు..అంతేకాదు పూజ చేస్తున్నంత సేపు భక్తి శ్రద్దలతో పూజలు చేయాలని, అప్పుడే అన్నీ బాధలు తొలగి పోతాయి..

Read more RELATED
Recommended to you

Latest news