WTC ఫైనల్స్: కె ఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ !

-

ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో కొందరు ఇండియా ప్లేయర్స్ మాత్రం అదరగొడుతుంటే , అంచనాలకు తగిన విధంగా మరికొందరు రాణించలేక చతికిలబడుతున్నారు. కాగా ఈ ఐపీఎల్ తర్వాత ఇండియా ఇంగ్లాండ్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇండియా తరపున జట్టును ప్రకటించిన బీసీసీఐ… ఇప్పుడు జట్టులో ఒక మార్పును చేసింది. ఇటీవల ఐపీఎల్ ఆడుతూ గాయపడిన కె ఎల్ రాహుల్ స్థానంలో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ను భర్తీ చేసింది. కాగా మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కె ఎల్ రాహుల్ దాదాపుగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఇక చేసేది ఏమీ లేక బీసీసీఐ ప్రత్యామ్నాయంగా ఇషాన్ కిసాన్ ను జట్టులోకి తీసుకుంది. మరి ఇషాన్ కిషన్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో రాణించి ఇండియా కు మొదటి టైటిల్ ను అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news