మణిపూర్ లో విమానం టికెట్ ధరలకు రెక్కలు…

-

మణిపూర్ లో కులాల పేరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దీనితో మణిపూర్ రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు అంతా తమ తమ రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైట్ లో ప్రయాణించే వారు అక్కడి ధరలను చూసి కంగుతింటున్నరు. మాములుగా అయితే మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి ఇతర రాష్ట్రాలకు ఫ్లైట్ టికెట్ ధర రూ. 2500 నుండి రూ. 5000 వేలుగా ఉండేది. అయితే తాజాగా విమానయాన సంస్థలు కలెక్ట్ చేస్తున్న ధర చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒక్కో టికెట్ రూ. 13 వేలు నుండి రూ. 20 వేలు గా ఉంది. అంటే పాత ధరకు అయిదు ఆరు రేట్లు పెంచేశాయి.

 

దీనితో ప్రయాణికులు ఇబ్బందిపడడమే కాక, ఇక చేసేదేమీ లేక అంత ఖర్చును భరించి టికెట్ కొనుక్కుని వెళుతున్నారు. దీనిపై ఎవరైనా బాధ్యత వహించి సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయాలని అక్కడి వారు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news