అయోధ్య నిర్మానానికి యశ్​ రూ.50కోట్ల విరాళం… అందులో నిజమెంత?

-

కేజీయఫ్​ సిరీస్‌ విజయాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యష్‌. ముఖ్యంగా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2తో ఆయన క్రేజ్‌ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. బాలీవుడ్ స్టార్‌ హీరోల సినిమాలను మించి ఈ చిత్రం కలెక్షన్లను అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్​ ముందు రూ.1200కోట్లను అందుకుంది.

యశ్
యశ్

అయితే ఇప్పుడు రాకీభాయ్ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త బాగా వైరలవుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం దేశంలోని లక్షలాది మంది విరాళాలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రామమందిర నిర్మాణానికి రాకింగ్ స్టార్ యష్ కూడా 50 కోట్ల రూపాయల విరాళమిచ్చాడని ప్రచారం సాగుతోంది. ఇటీవల ఆయన రామమందిరాన్ని దర్శించుకున్నారని, ఈ సందర్భంగానే భారీ విరాళం ప్రకటించారని నెట్టింట్లో ఒక పోస్ట్‌ తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

యశ్
యశ్

యష్ ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. కర్ణాటకలోని సరస్సుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపుదల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. యష్ సంస్థ యశోమార్గ ద్వారా చాలా మందికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అయితే రామమందిర విరాళంపై వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని సినీవర్గాలు తెలిపాయి.

యశ్
యశ్

‘రాకీభాయ్‌ ఇటీవల అయోధ్యను సందర్శించుకున్నది నిజమే. ఈ సమయంలోనే రామమందిర నిర్మాణానికి 50 కోట్ల రూపాయల విరాళం ఇస్తానని యష్‌ ప్రకటించాడు’ అని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్‌ చేశారు. దీంతో పాటు ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే అది అయోధ్య సందర్శన ఫొటో కాదు. కేజీయఫ్​ 2 సినిమా విడుదలకు ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పటి ఫొటోలను ఉపయోగించి ఇప్పుడు రూ.50 కోట్ల విరాళమంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news