ఆదోనిలో వైసీపీ అభిమానుల వీరంగం..ఆటో డ్రైవర్ పై దాడి..!

-

ఏపీలో వైసీపీ పార్టీ అభిమానులు వీరంగం సృష్టిస్తున్నారు..ఎంతో గొప్ప లక్షంతో అధికారంలోకి వచ్చిన జగన్‌ పార్టీ..కొద్ది మంది కింది స్థాయి క్యాడర్‌ విధానాల వల్ల మొత్తం పార్టీకే చెడ్డ పేరు వస్తుంది..తాజాగా కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ అభిమానులు వీరంగం సృష్టించారు.. ఇవాళ ఉదయం ఆదోని MLA సాయిప్రసాద్ రెడ్డి వాహనంలో ఆలూరు రోడ్డుపై వెళ్తుండగా..అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై కామెంట్స్ చేశాడు..రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఎమ్మెల్యేకు సమస్య అర్ధం కావాలంటే..అతని వాహనం ఈ గుంతల్లో ఇరుక్కోవాలని విమర్శించాడు.దీంతో పక్కనే ఉన్న వైసీపీ అభిమానులు ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు.. అతన్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి వాహనంలో బలవంతంగా తీసుకెళ్లి శిల్పా ఎస్టేట్ వెనుక భౌతికంగా దాడికి పాల్పడ్డారు..తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ రవి స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనుచరులపై మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిచేసిన వారిని మందలించారు..బాధితుడిని పరామర్శించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు..అంతేకాకుండా త్వరలోనే ఆలూరు రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news