గంగాధర్ రెడ్డి మరణానికి వైసీపీ కి ఎటువంటి సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

-

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్ రెడ్డి హత్య కేసుకు వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. సహజంగా మరణించినా దానిని మాపై ఆపాదిస్తున్నారని, అది ఒక చంద్రబాబుకే సాధ్యం అని అన్నారు. ఆరోపణలు చేయడమే ధ్యేయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రవర్తిస్తున్నారని అన్నారు.

వైసీపీ వాళ్లను అసభ్య పదజాలంతో దూషించడం టీడీపీ నేత నారా లోకేష్ కు అలవాటేనని విమర్శించారు. నిన్న లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగుకు”కంసమామ జగన్” అని పేరు పెట్టారని మండిపడ్డారు. ఇంత జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు కాబట్టే ప్రశ్నించడానికి జూమ్ మీటింగ్ లోకి మా వాళ్ళు వెళ్లారని చెప్పారు. తండ్రి కొడుకులు బుద్ధి మార్చుకోకపోతే తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నిన్న జరిగింది కేవలం ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఎదురుదాడి చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news