నా గొంతు కోయటానికి చూస్తున్నారు..జగన్ సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలోని కొన్ని కుటుంబాలు నా గొంతు కోయటానికి చూస్తున్నాయని..జగన్ సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్న సమస్యలనే నేను సీఎం జగన్‌ తో మాట్లాడానని.. నేను ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారని తెలిపారు.

నా నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం వెనుకబడి ఉందని..వేగం పెంచాలని సీఎం జగన్ సూచించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 141 రోజులు, మరోసారి 105 రోజులు గడప గడపకు కార్యక్రమం చేశాను.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు దఫాలు ప్రతి గడపను టచ్ చేశానని వెల్లడించారు. తర్వాత అనారోగ్య కారణాల వల్ల గడప గడపకు కార్యక్రమ సమయాన్ని కాస్త తగ్గించాల్సి వచ్చిందని..నెమ్మదిగా అయినా కచ్చితంగా తిరగాలని సీఎం సూచించారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news