ఏపీలో ఎమ్మెల్యేలు అందరూ హ్యాపీ: విజయసాయి

-

జీవిఎంసీ దగ్గర ఉన్నగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహాత్మా గాంధీ చెప్పిన సిద్ధాంతాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారు అని ఆయన అన్నారు. గ్రామ స్వరాజ్యమే ద్యేయంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు గాంధీజీ ఆశయాలు ఆదర్శం అని ఆయన కీర్తించారు.

మహాత్మాగాంధీ గొప్ప నేత అని కీర్తించిన ఆయన… రాష్ట్రంలో పాలన చూసి,చాలా మంది శాసనసభ్యులు సుముఖంగా ఉన్నారని అన్నారు. కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రిగారు పరిశీలనలో ఉన్నాయని, సరైన సమయంలో జగన్ మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేసారు. పార్టీఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రిగారు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news