ప్రతి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లు వేయండి – సీఎం జగన్

-

‘ప్రజల సెల్ ఫోన్లకు జగన్ స్టిక్కర్లు’ అతికించేందుకు అధికార వైసీపీ పార్టీ సన్నద్ధం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్ళకు తిరిగి వాటి తలుపులకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించడంతోపాటు, ఆయా ఇళ్లలోని వారి సెల్ ఫోన్ లకు ప్రత్యేకంగా రూపొందించిన చిన్న సైజు స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు.

సచివాలయ వైకాపా సమన్వయకర్తలు, గృహ సారధులు మొత్తం 5.65 లక్షల మందితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట మార్చి 18 నుంచి 26 వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లు వేయండంటూ సీఎం జగన్ ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రజా ప్రతినిధులు సిద్ధం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news