వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే: నన్ను తరిమికొట్టే వాళ్ళు ఇప్పుడు రండి … !

-

వైసీపీ లోనే అంతర్గత కొట్టులాటపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే వైసీపీ అధిష్టానం ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అప్పటి నుండి ఉదయగిరిలో రాజకీయాలు హీటెక్కాయి. ఆ మధ్యన ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి మేకపాటికి ఉద్దేశించి నిజంగానే మేకపాటి అమ్ముడుపోయాడని , దమ్ముంటే రాజీనామా చేసి నాపై ఇండిపెండెంట్ గా గెలవాలని సవాలు విసరడమే కాకుండా ఉదయగిరి వస్తే రాళ్లతో కొట్టి తరుముతానని అన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయి నన్ను తరిమికొట్టే వాళ్ళు ఇప్పుడు రావాలి అంటూ ఉదయగిరి బస్ స్టాండ్ సెంటర్ లో చైర్ వేసుకుని కూర్చున్నాడు. మరి ఈ విషయంపై చేజర్ల సుబ్బారెడ్డి ఏమైనా స్పందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news