తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే.. కేటీఆర్ పై వీ.హెచ్. ఫైర్..!

-

కేటీఆర్ మాట్లాడిన తీరు బాలేదని.. మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేర్కొన్నారు. సీఎం దావోస్ పోవడం తెలంగాణ కోసమే వెళ్లారని తెలిపారు. మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టిన వాళ్లను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క పని చేయలేదన్నారు. పదేళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించారు. పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా అన్నారు. మేము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు ఇచ్చామన్నారు. ధరణి కమిటీ వేశామని… అనేక పనులు జరుగుతున్నాయన్నారు.

తొందరపడి మాట్లాడితే మీరు ఇంకా నష్టపోతారని మండిపడ్డారు వీ.హెచ్. ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడండి అని చెప్పారు. మీ ప్రకటనల వల్ల మీరే ఇంకా దిగజారిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం దావోస్ వెళ్లి కామెంట్స్ చేయడం హాస్యంగా ఉందన్నారు. కేటీఆర్ చదువుకున్న వాడే.. అన్ని చెస్తా మేము అన్నారు. మీ మాటలను ఎవ్వరూ నమ్మరని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news