కోహ్లికి చుక్కలు చూపిస్తున్న యువ క్రికెటర్లు…!

-

టీం ఇండియా యువ ఆటగాళ్ళు కెప్టెన్ విరాట్ కొహ్లీ చుక్కలు చూపిస్తున్నారు. ఆట మీద కంటే అమ్మాయిల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. వివరాల్లోకి వెళితే టీం ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా యువ ఆటగాళ్ళ హవానే కొనసాగుతుంది. వాళ్ళను అన్ని విధాలుగా విరాట్ కోహ్లి ప్రోత్సహిస్తున్నాడు. అటు టీం ఇండియా యాజమాన్యం కూడా వాళ్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తుంది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ సహా కొందరు ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు.

వాళ్ళు ఒక మ్యాచ్ లో ఆడిన, మరొక మ్యాచ్ లో ఆడకపోయినా, సీరీస్ లకు సీరీస్ లు ఆడకపోయినా సరే వాళ్లకు అండగా నిలుస్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం వచ్చిన అవకాశాలను వాడుకోకుండా అమ్మాయిల వెంట పడుతున్నారు. ముఖ్యంగా పంత్ పాండ్యా అయితే ఇదే పని మీద ఉంటున్నారు. పాండ్యా మీద ఇప్పటికే అనేక గాసిప్ లు రాగా తాజాగా సెర్బియా నటితో నిశ్చితార్ధం చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. గత కొంత కాలంగా అతను టీం లో లేడు. గాయం కారణంగా విశ్రాంతి ఇచ్చారు.

పంత్ కి వరుసగా అవకాశాలు వస్తున్నా హడావుడిగా నాలుగు షాట్లు కొట్టి వెళ్ళిపోతున్నాడు. తాజాగా ఒక అమ్మాయితో కలిసి ఫోటోలు పోస్ట్ చేసాడు. ఇప్పుడిప్పుడే వీళ్ళు జట్టులో కీలక ఆటగాళ్లుగా మారుతున్నారు. ఆల్ రౌండర్ పేసర్ లేక హార్దిక్ పాండ్యా కు అవకాశం ఇస్తున్నారు. కీపర్, లెఫ్ట్ హ్యాండెడ్ లేక పంత్ కి అవకాశం ఇస్తున్నారు. అయినా సరే ఈ ఇద్దరు వచ్చిన అవకాశాలను వాడుకోకుండా ఎంత సేపు అనవసర విషయాల మీద దృష్టి పెట్టడం కెప్టెన్ కోహ్లికి తల నొప్పిగా మారింది. ఇక అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావడంతో కోహ్లి ఎం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news