Breaking : హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ కు యువకుడు బలి

-

హైదరాబాద్ మహానగరం లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాదులో ఉన్న ద్రాక్ష తీసుకొని ఓ యువకుడు మరణించాడు. గోవా కి వెళ్లి డ్రగ్స్ తీసుకుంటున్న బీటెక్ విద్యార్థి… డ్రగ్స్ కు అలవాటు పడి రోగిగా మారాడు. ఈ నేపథ్యంలోనే ఆ విద్యార్థి మరణించాడు. దీంతో హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకోని మరణించిన తొలి కేసు నమోదు అయింది.

వారం రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై ఆ విద్యార్థి మృతి చెందాడు. అయితే గోవా నుంచి డ్రగ్స్ ఇచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న యువకులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ట్రైన్ తో పాటు మృతి చెందిన యువకుడు కూడా… డ్రగ్స్ తీసుకొని అమ్మే వాడని పోలీసులు చెబుతున్నారు.

డ్రగ్స్ దందా చేస్తున్న రెండు గ్యాంగ్ లకు చెందిన ఇద్దరు వేరు వేరు వ్యక్తులను అరెస్ట్ చేసామని.. ఒకరు ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, మరో వైపు ప్రేమ్ డ్రగ్స్ దందా చేస్తున్నాడని… రామకృష్ణ- నిఖిల్- జీవన్ వ్యక్తులు ప్రేమ్ నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకోవడమే కాదు ఇతరులకు అలవాటు చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news