పెళ్ళి పేరుతో మోసం : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు పై యువతీ ఫిర్యాదు !

-

ఈ మధ్యకాలంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకు వచ్చినప్పటికీ.. కొందరు కామాంధులు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా డబ్బున్న వారి పిల్లలు ఈ అఘాయిత్యాలకు పాల్ పడుతుండటం గమనార్హం. అయితే తాజాగా… టిఆర్ఎస్ వైరా మాజీ‌ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కొడుకు పై ఓ యువతి‌ ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి‌ పేరు తో మోసం చేశాడని ఈ ఫిర్యాదు లో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు బానోతు మృగేందర్ పై కేసు బుక్ చేశారు పోలీసులు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కొడుకె బానోతు మృగేందర్.

ప్రస్తుతం మధురై లో ట్రైనీ ఐఏఎస్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు నిందితుడు మృగేందర్. బ్రదర్ ను అవుతానంటూ ఫెస్ బుక్ లో యువతి ని పరిచయం చేసుకున్న బానోతు మృగేందర్.. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతి కి దగ్గరయ్యాడు. ఇటీవలే ఐపీఎస్ కూడా క్రాక్ చేశాడు మృగేందర్. యువతిపై తన రూమోలోనే లైగింకంగా దాడి చేసినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లి చేసు కోమంటే మృగేందర్ ముఖం చాటేస్తున్నట్లు ఫిర్యాదు తెలిపింది. అంతే కాదు బాధితురాలిని మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ పలుమార్లు బెదిరించినట్లు ఫిర్యాదు లో బయటపడింది. తన కొడుకును మరిచి పోకపోతే చంపేస్తానని యువతిని బానోతు మదన్ లాల్ బెదిరించినట్లు సమాచారం అందుతోంది. ఇక బెదిరింపులు తాళ లేక కూకట్ పల్లి పిఎస్ లో‌ యువతి‌ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news