వంశీ వైసీపీ ఎంట్రీ వెన‌క జ‌గ‌న్ మార్క్..!

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో అందరి నోళ్లలో నానుతోంది. వంశీ టీడీపీకి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న వైసీపీలోకి వెళ్లిపోతున్నారంటూ ఒక్క‌టే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలో వంశీకి ఇద్ద‌రు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మంత్రులు ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా వారే చ‌క్క‌పెడుతున్న‌ట్టు కూడా టాక్‌. ఇంత‌కు ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రో కాదు.. ఒక‌రు కొడాలి నాని అయితే మ‌రొక‌రు పేర్ని నాని.

ఇక చంద్రబాబుకు…. తెలుగుదేశానికి విధేయుడైన వంశీ వైసీపీలోకి వెళ్లడానికి.. అలాంటి నేపథ్యమున్న వంశీని వైసీపీలో చేర్చుకోవడానికి చాలా కార‌ణాలే ఉన్నాయ్‌. అంతెందుకు ఆ మాట‌కు వ‌స్తే వంశీకి జ‌గ‌న్‌కు కూడా మంచి రిలేష‌న్ ఉంది. గ‌తంలో వంశీ ఓ సారి జ‌గ‌న్‌ను బ‌హిరంగంగానే విజ‌య‌వాడ‌లో వాటేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఇక జ‌గ‌న్ భార్య భార‌తికి వంశీ భార్య‌తో కూడా ప‌రిచ‌యాలు ఉన్నాయి.

ఈ ఎన్నిక‌ల‌కు ముందే వంశీ వైసీపీలోకి వెళ్లి గ‌న్న‌వ‌రంలో పోటీ చేస్తార‌న్న టాక్ కూడా బ‌లంగా వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే అస‌లు చిన‌బాబు లోకేష్ వంశీకి ఎప్పుడు ప్ర‌యార్టీ ఇచ్చేవాడు కాదు. అందుకే వంశీకి చిన‌బాబు అంటే మంట అన్న రూమ‌ర్ కూడా ఉంది. ఇక మ‌రో ఐదేళ్ల పాటు ప్రతిప‌క్షంలో ఉండ‌డం ఇవ‌న్నీ వంశీని టీడీపీలో ఉండ‌నీయ‌డం లేదు. ఇక జ‌గ‌న్ కోణంలో కూడా వంశీని వైసీపీలోకి తీసుకునేందుకు ప్లాన్ ఉంద‌ట‌.

ఇటీవ‌ల హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఏకంగా 43 వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది. అస‌లు ప్ర‌తిప‌క్షాల‌కు ఈ విజ‌యం త‌ర్వాత నోట మాట రావ‌డం లేదు. వైసీపీ ప్ర‌భుత్వంపై ఐదు నెలల్లోనే వ్య‌తిరేక‌త ఉంద‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు గ‌న్న‌వ‌రంలో భారీ మెజార్టీతో విజ‌యం సాధిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న మచ్చ తొలగిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం.

పైగా హుజూర్‌న‌గ‌ర్ కాంగ్రెస్‌కు కంచుకోట‌.. అది ఆ పార్టీ సిట్టింగ్ సీటు అక్క‌డ టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు గ‌న్న‌వ‌రం టీడీపీ కంచుకోట‌… అది టీడీపీ సిట్టింగ్ సీటు. అక్క‌డ వైసీపీ గెలిస్తే ఆ పార్టీకి, సీఎం జ‌గ‌న్ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. సేమ్ హుజూర్‌న‌గ‌ర్ సీన్ రిపీట్ అయిన‌ట్టు ఉంటుంది. ఇక ఇసుక కొర‌త నేప‌థ్యంలో త‌మ పార్టీపై వ్య‌తిరేక‌త ఉందా ? అన్న సందేహాలు వైసీపీ వాళ్ల‌కు, జ‌గ‌న్‌కు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీపై ప్ర‌జాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చ‌న్న‌దే వారి ప్లాన్‌… పైగా ఇది క‌మ్మ వ‌ర్గం ఓట్లు ఎక్కువుగా ఉన్న‌… టీడీపీకి కంచుకోట లాంటి సీటు కావ‌డంతో జ‌గ‌న్ వంశీని త‌మ పార్టీ సింబ‌ల్‌పై పోటీ చేయించి స‌త్తా చాటాల‌ని చూస్తున్నాడ‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news