చంద్రబాబు – ఎల్లో మీడియాపై జగన్ లేటెస్ట్ డిగ్నిఫైడ్ పంచ్ ఇది!

-

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాప్పుడు, పాదయాత్ర సమయంలోనూ తనదైన దూకుడుతో నాటి అధికార టీడీపీ నాయకులకు తనదైన డైలాగులతో ముచ్చెమటలు పట్టించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ … ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అనంతరం చాలా హుందాగా మారిపోయారు. మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ… ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శలకు కృంగిపోకుండా… సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఎల్లోమీడియాపై తనదైన హుందాతనపు పంచ్ పేల్చారు జగన్!

ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా… తనపని తాను కచ్చితంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా చేసుకుపోతున్నారు జగన్. తనకు జనం ముఖ్యం, వారేమనుకుంటున్నారన్నది ముఖ్యం.. వారికి ఏమి కావాలి, తానేమివ్వగలను అన్నదే ముఖ్యం తప్ప… రాజకీయ నిరుద్యోగులు, అస్తమిస్తున్న నాయకులు ఏమి అంటున్నారు అనేది పట్టించుకోవడం మానేసి చాలా రోజులే అయ్యింది! ఈ క్రమంళో తాజాగా స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన జగన్… “మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్‌ మైండ్‌ సెట్ ‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నాము” అని ఒక డైలాగ్ వేశారు!

ఈమధ్యకాలంలో ఆ మీడియా గురించి అసలు పట్టించుకోను కూడా పట్టించుకోని జగన్… ఆ డైలాగ్ ఎందుకువేశారబ్బా అని ఆలోచించేలోపే… మళ్లీ ఆయనే క్లారిటీ ఇచ్చారు.. తాను ఎంత హుందాగా ఉన్నది చెప్పకనే చెప్పారు!! “మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు.. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం.. నెగిటివ్‌ వార్తలు చదువుదాం.. మనం కరెక్ట్‌ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం.. వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం” అని సీఎం హుందా అయిన డైలాగులు పేల్చారు! ఇలా కదా సీఎం అనే వ్యక్తి ఉండాల్సిన హుందాతనం అని గతంలో బాబు వ్యవహారాలు గుర్తుకుతెచ్చుకున్నవారు స్పందించడం ఈ సందర్భంగా కొసమెరుపు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news