ధాన్యం కొన‌క‌పోతే…కేసీఆర్‌ మూట ముళ్ళె సర్దుకోవాల్సిందే : వైఎస్ ష‌ర్మిల వార్నింగ్‌

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్, టీఆర్ ఎస్ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొన‌క‌పోతే… ముళ్ల, మూట స‌ర్దుకోవాల్సిందేన‌ని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు వైఎస్ ష‌ర్మిల‌. ఇది యాసంగి పంటలు వేసుకునే కాలం అని చెప్పిన మీకు, ఆ కాలం కూడా వెళ్లిపోతుంది అని తెలియడం లేదా దొరా? అంటూ మండిప‌డ్డారు.

పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తుండని… చివరి గింజ వరకు కొంటాం అని చెప్పిన మాటల మొనగాడు, ఇప్పటి వరకు కొన్నది 30 శాతమేన‌ని ఫైర్ అయ్యారు. కొంటాడో కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్‌ గారు మాత్రం ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇప్పటికే 2 నెలలుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారని… రైతులు తిరగపడక ముందే పంట మొత్తం కొనాల్సిందేన‌ని డిమాండ్ చేశారు ష‌ర్మిల‌. లేకపోతే కేసీఆర్‌ మూట ముళ్ళె సర్దుకోవాల్సిందేన‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news