తాగుబోతోని క‌ష్టం మీకే బాగా తెలిసిన‌ట్టు..కేసీఆర్ పై ష‌ర్మిల ఫైర్..!

-

సీఎం కేసీఆర్ పై వైటీపీ అధినేత ష‌ర్మిల షైర్ అయ్యారు. రైతుల కడుపుకొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు రండి బాబూ రండి అంటూ డోర్లు తెరుస్తున్నావ్ అంటూ కేసీఆర్ పై ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రైతుల కడుపుకొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నవ్.. సిగ్గుపడు కెసిఆర్ అంటూ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇంటికో తాగుబోతోన్ని తయారు చేస్తున్నందుకు సిగ్గుప‌డు అంటూ మండిప‌డ్డారు.

Sharmila
Sharmila

ఆదాయం పెంచుకొనే తెలివిలేక లిక్కర్ మీద రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు సిగ్గుపడు అంటూ ఫైర్ అయ్యారు. తాగుబోతోళ్ళ కష్టం మీకే బాగా తెలుసినట్లు .. గల్లీకో వైన్ షాప్, వీధికో బార్ షాప్, గ్రామానికో 10 బెల్ట్ షాపులు పెట్టి బంగారు తెలంగాణను బారుల తెలంగాణగా, బీరుల తెలంగాణగా మార్చారు దొరగారు అంటూ ష‌ర్మిల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి లిక్కర్ షాపులను పెంచడంలో డ్రగ్స్ అమ్మడంలో మాత్రమే కనిపిస్తుంది అంటూ ష‌ర్మిల కేసీఆర్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news