నిరుద్యోగులకు KCR చేసింది మోసం కాదు, ద్రోహం కూడా – వైఎస్ షర్మిల

-

నిరుద్యోగులకు KCR చేసింది మోసం కాదు, ద్రోహం కూడా అని వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. నిరుద్యోగులకు KCR చేసింది మోసం కాదు, ద్రోహం కూడా… రెండోసారీ ఉద్యోగాల భర్తీలో KCR మోసమే చేశారని ఫైర్‌ అయ్యారు.

పేపర్ లీకేజీలపై వెంటనే CBI విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు షర్మిల. బిస్వాల్ కమిటీ చెప్పిన 1.91లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. కొత్త జిల్లాల వారీగానూ ఖాళీలు నింపాలి. నిరుద్యోగులకు YSRTP అండగా ఉంటుందన్నారు.ఎవడు చస్తే నాకేంటని.. వెంట నడిచినోళ్ళను .. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్ .. సకల జనులను మోసం చేసావ్ .. కానీ ఇప్పుడు నీ పీఠం కదులుతుందని .. లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని.. పేపర్ లీకేజి వ్యవహారం అధికార శాపం అయ్యేసరికి.. ఎన్నికలు వస్తున్నాయని.. ఎత్తులు వేస్తున్నావా? అయ్యా కెసిఆర్ గారు అని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు.. ఉద్యమకారులకు అన్యాయం జరిగినపుడు..మీ పార్టీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు..ఒక్క నాడైనా ఆత్మహత్యలు చేసుకోకండి అని ఒక్కరికైనా లెటర్ రాసావా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news