ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా…కేసీఆర్‌ పై షర్మిల సెటైర్‌

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌…. గత నాలుగు రోజుల వరుసగా ఇతర రాష్ట్ర సీఎంలు, జాతీయ నాయకులతో ప్రగతి భవన్‌లో భేటీ అవుతున్నారు. మొన్న కేరళ సీఎం విజయన్‌, నిన్న ఆర్జేడీ యంగ్‌ లీడర్‌, లాలూ ప్రసాద్‌ కొడుకు తేజస్వీ యాదవ్‌ తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. అయితే..ఈ సమావేశాలపై తెలంగాణ వైసీపీపార్టీ అధినేత వైఎస్‌ షర్మల సెటైర్లు పేల్చారు. ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా అంటూ సీఎం కేసీఆర్‌ కు చురకలు అంటించారు వైఎస్‌ షర్మిల.

మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ సీఎంతో మంతనాలు చేయడానికి, బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి, దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా బ్యాంకుల ఆగడాలకు రైతులు బలైపోతున్నది మీకు కనపడుతుందా దొరా ? అని నిలదీశారు. పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకొనే రైతులు మీకు కనపడరని మండిపడ్డారు. వడ్డీ వ్యాపారుల చేతుల్లో నష్టపోయిన రైతులు మీకు కనపడరు…. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకొనే రైతులు మీకు కనపడరు… ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి తరువాత దేశాన్ని ఏలపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news