వైఎస్ వివేకా హత్య కేసు : రంగయ్య సాక్ష్యంపై మరో ట్విస్ట్

-

కడప : వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు ఎర్రగంగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివేకా నాకు దేవుడితో సమానమని..నేను చీమకు కూడా హాని చేయను అని పేర్కొన్నాడు. కేవలం వివేకా తో నేను సన్ని హితంగా వుండడం వల్లే నాపై కేసులు పెట్టారని..నన్ను సీబిఐ విచారిస్తోందని స్పష్టం చేశారు.

వాచ్ మెన్ రంగన్నను వివేకా ఇంట్లో చూశాను తప్ప ఏరోజు మాట్లాడలేదని ఎర్రగంగిరెడ్డి తెలిపారు.. రంగన్నను తాను బెదిరించింది అవాస్తవమని పేర్కొన్నారు. వివేకా హత్యకేసులో తన ప్రమేయం వుందని అతను నాపై ఎలా చెపుతున్నాడో అర్ధం కాలేదని ఎర్రగంగిరెడ్డి అన్నారు. వివేకా హత్యకేసు లో నాప్రమేయం వుందంటే ఏ శిక్షకైనా సిద్దం.. ఏప్రమాణాని కైనా సిద్దమని సవాల్ విసిరారు.

హత్య జరిగిన రోజు రాత్రి ముందు వివేకాతో కలిసే వున్నామన్నారు. తనను తమ ఇంటి దగ్గర దింపి వివేకా ఇంటి కెల్లాడని.. హత్య జరిగిందని ఉదయం 7 గంటలకు వివేకా భావమరిది తనకు కాల్ చేసి చెప్పాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీత కూడా నన్ను వివరాలు అడిగారని చెప్పిన ఎర్రగంగిరెడ్డి.. రాత్రి తిరిగి వచ్చిన వివారాలు ఆమెకు వివరించానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news