మరో పథకానికి జగన్ కసరత్తు..దసరా నుంచే ప్రారంభం

-

సంక్షేమ పథకాలతో జగన్‌ సర్కార్‌ దూసుకుపోతోంది. ఇప్పటికే చాలా రకాల పథకాలు తీసుకొచ్చిన జగన్‌ సర్కార్‌.. తాజాగా మరో పథకానికి తెరలేపింది. ఏపీలో మరో పథకానికి జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్‌.

వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ. 1 లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు.. ఎస్టీలకు రూ. లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ. 50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు.. ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ. 1 లక్ష, విభిన్న ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ. 1.50 లక్షల మేర పెళ్లి కానుక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news