ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..నేటి నుంచే వైయస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

-

ఏపీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ పెన్షన్ కానుక కింద ఏకంగా 63 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు.

తాజాగా, ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తాన్ని మార్చ్ ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ద వారి చేతికి అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పం లో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news