YSRCP : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాల అంశంపై వైసీపీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెడుతోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజు మ‌ధ్య కొంత‌కాలంగా విభేదాలు ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఈ టాక్ నిజ‌మే అనిపించేలా ఉంది. న‌ర్సాపురంను జిల్లా కేంద్రం చేయాల‌ని బుధ‌వారం అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న నిర్వ‌హించారు.బైకుర్యాలీ కూడా చేశారు. ఇందులో మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు త‌న చెప్పుతో తానే కొట్టుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న‌ర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్ర‌సాద‌రాజును గెలిపించినందుకు త‌న చెప్పుతో తాను కొట్టుకుంటున్నాన‌ని వ్యాఖ్యానించారు. అస‌మ‌ర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించి త‌ప్పు చేశాన‌ని, ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో అక్కడున్న నాయకులు వారించి మాజీ మంత్రి వ‌ద్ద నుంచి చెప్పు ను లాక్కున్నారు. మ‌రొక వైపు ఏపీలో ఏప్రిల్ 02 నుండి కొత్త జిల్లాల్లో పాల‌న ప్రారంభం కానున్న‌ది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news