టీడీపీ ఎమ్మెల్యేలు నాపై దాడి చేశారు: సుధాకర్ బాబు

-

టిడిపి సభ్యుడు బాల వీరాంజనేయ స్వామి స్పీకర్ పై దాడికి ప్రయత్నించారని YCP ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు వైసిపి ఎమ్మెల్యే ఎలిజా వెళ్లగా, ఆయనను కూడా కిందకు తోసే ప్రయత్నం చేశారని చెప్పారు.

ఎలిజాను కాపాడేందుకు తాను వెళ్ళగా తనపైన టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేశారని సుధాకర్ బాబు చెప్పారు. ఈ దాడి విజువల్స్ ను విడుదల చేయాలని స్పీకర్ ను కోరారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పై దాడి చేసిన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది శాసనసభ కాదు… కౌరవ సభ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్ కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు చంద్రబాబు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news