కరోనా కల్లోలం.. చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు పాజిటివ్‌

-

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న క్రికెటర్లను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే కునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లకి కరోనా సోకింది. యజువేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. పాండ్యాతో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. పాండ్యాకు కరోనా రావడంతో టీమిండియా క్రికెటర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో చాహల్, కృష్ణప్ప గౌతమ్‌‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిని ఐసోలేషన్‌కు పంపారు. వైద్యుల బృందం వీరిని పర్యవేక్షిస్తోంది. మరో ఆరుగురికి నెగిటివ్ రావడంతో ఊపరి పీల్చుకున్నారు. పాండ్యాతోపాటు వీరిద్దరూ కూడా మిగిలిన మ్యాచులకు దూరంగా ఉండనున్నారు. పాండ్యకు కరోనా రావడంతో గురువారం జరగాల్సిన టీ ట్వంటీ మ్యాచ్ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news