మంచిర్యాల ఎమ్మెల్యేకు కరోనా.. ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తానికి !

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ భారీన చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పడ్డారు. ఒక మరికొంత మంది ఈ కరోనా బారీన పడి మృతి చెందారు. పేద, ధనిక అనే తేడానే లేకుండా అందరినీ ఈ కరోనా మహమ్మారి కుదేపిస్తోంది.

అయితే.. తాజాగా మంచిర్యాల, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దివాకర్ రావ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో పాల్పడుతున్న దివాకర్ రావ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఎమ్మెల్యే దివాకర్ రావ్ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అతనితో పాటు కుటుంబ సభ్యుల్లో నలుగురికి కరోనా నిర్థారణ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ మొత్తం సెల్ఫ్‌ ఐసోలేషన్‌ లోకి వెళ్లింది. అటు ఎమ్మెల్యే దివాకర్ రావ్ కు పరిస్థితి కూడా మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news