అధికమాసం ఈ నాలుగు రాశుల వారికి శుభప్రదం.. లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బేడబ్బు..!

-

శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. సాధారణంగా ఈ నెలలోనే శుభాకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. లక్ష్మీదేవికి విశేషమైన పూజలు చేస్తారు. అయితే ఇది అధికమాసం కావడం వల్ల శుభాకార్యాలను వాయిదా వేసుకున్నారు. ఈ అధికమాసంలో కొన్ని రాశుల వారు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందట. రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకీ ఆ నాలుగు రాశులేంటో చూద్దామా..!

Horoscope
Horoscope

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశి చక్రాలలో వృషభం ఒకటి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి జీవితంలో పెద్దగా సమస్యలు రావు. తన జీవితంలో ఏవైనా సమస్యలుంటే అమ్మ లక్ష్మి కృపతో అవి త్వరగా తొలగిపోతాయి. వృషభరాశివారు తప్పనిసరిగా లక్ష్మీదేవిని రోజూ పూజించాలి. నెయ్యితో దీపం వెలిగించాలి.

కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అధికమాసం శుక్రవారం, శ్రావణ శుక్రవారాల్లో కర్కాటక రాశి వారు పురోగతి సాధించడానికి, జీవితంలో విజయం సాధించడానికి లక్ష్మీ దేవిని పూజించాలి.

వృశ్చిక రాశివారిపై సంపదలకు అధిదేవతలైర కుబేరుని, లక్ష్మి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అధిక మాసంలో లక్ష్మీ దేవి వారిపై తన ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటుందట. ఈ కారణంగా వృశ్చికరాశివారు అధిక మాసంలో లక్ష్మీ దేవి మంత్రాలను ఎక్కువగా జపించాలి.

సింహ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడి పని చేయడం ద్వారా ప్రతి రంగంలో విభిన్న స్థానాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉండాలంటే అధికమాసం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి. అధికమాసంలోని శుక్రవారం నాడు ఆమెకు ప్రీతికరమైన భోగాన్ని సమర్పించాలి. మంత్రాలను పఠించాలి.

ఈ నాలుగు రాశులు వారు అధిక మాస సమయంలో లక్ష్మీ దేవిని పూజిస్తే ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. ఇది వారి జీవితంలో సంపద, శ్రేయస్సును తెస్తుందని పండితులు అంటున్నారు. నమ్మకం ఉంటే ప్రయత్నించి చూడండి. పోయేదేం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news