ఆ జాకెట్‌ వేసుకున్న మహిళను టచ్‌ చేస్తే.. కరెంట్‌ షాకే..!!

-

ఓ పక్కన టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. 4G నుంచి 5Gకి వచ్చాం.. మహిళలపై దాడులు కూడా పెరుగుతున్నాయి..చట్టాలు నష్టం జరిగిన తర్వాతే కానీ..ముందు ఏం చేయలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల కోసం. ఓ స్మార్ట్‌ జాకెట్‌ను తయారుచేశారు కొంతమంది విద్యార్థులు.. ఈ జాకెట్ వేసుకున్న మహిళలకు ఇక తమపై ఎవరో దాడి చేస్తారు.. అఘాయిత్యాలకు పాల్పడతారనే భయమే అవసరం లేదు. ఎందుకంటే.. తమ జోలికి వచ్చే వారిని భయపెట్టేలా చేస్తుంది ఈ స్మార్ట్ జాకెట్.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు.. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్మార్ట్ సొల్యూషన్‌తో ముందుకు వచ్చారు. దురుద్దేశంతో మహిళలను బలవంతం చేసినప్పుడు, వారిని టచ్ చేసి ఇబ్బందులకు గురిచేసే ఆకతాయిలకు తగిన గుణపాఠం చెప్పేలా స్మార్ట్ జాకెట్‌ను రూపొందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కి చెందిన విద్యార్థులు ఈ స్మార్ట్ జాకెట్‌ను రూపొందించారు. స్మార్ట్ జాకెట్ ధరించిన మహిళలపై ఎవరైనా చేయి వేయడానికి ప్రయత్నిస్తే వెంటనే విద్యుత్తు షాక్ తగులుతుంది. అవతలి వ్యక్తి బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అదే స్థాయిలో విద్యుత్తు షాక్‌కు గురౌతాడు. ఒక మహిళపై ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే లైవ్ రికార్డింగ్ కోసం ఈ స్మార్ట్‌ జాకెట్‌లో చిన్న చిన్న కెమోరాలను అమర్చారు. దీంతో నిందితుడిని గుర్తించవచ్చు.
ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారు చేసేందుకు విద్యార్థులు వైర్లు, సెన్సార్లు, ట్రాన్స్‌మిటర్లు, కెమెరాలు, బ్యాటరీలు, బ్లూటూత్ మైక్రోఫోన్లు, మెటల్ షీట్‌లను ఉపయోగించారు. ఇది ఉపయోగించే మహిళల భద్రత కోసం, రెండు కెమెరాలు ఏర్పాటు చేశారు. జాకెట్ ముందు వైపు ఒకటి, వెనుక వైపు మరో కెమెరా అమర్చారు. దుండగులు ఎటువైపు నుంచి వచ్చినా వారిని గుర్తించేందుకు వీలుగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్‌లను ఉత్పత్తి చేస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ వినిత్‌రాయ్ తెలిపారు.
అర్థరాత్రి సమయాల్లో తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ జాకెట్లను రూపొందించామని వీటిని తయారుచేసిన విద్యార్థులు తెలిపారు. లేట్ షిఫ్ట్‌లలో పనిచేసే మహిళలు తమ భద్రత గురించి భయపడుతున్న విషయాన్ని గమనించి ఈ స్మార్ట్ జాకెట్‌ను తయారుచేశారు.
ఈ జాకెట్‌ వేసుకున్న మహిళలపై దాడులకు యత్నించేవారికి వెంటనే విద్యుత్తు షాక్‌కు గురౌతారు. అయితే ఈ కరెంట్‌షాక్‌తో ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా వ్యక్తి బయటపడతాడు. ఈ స్మార్ట్ జాకెట్ 200 నుండి 4000 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండగా.. ఏ సమయంలో ఎంత వొల్ట్లల విద్యుత్తును విద్యుత్తును ఉత్పత్తి చేయాలో జాకెట్ వేసుకున్న వ్యక్తులు సెట్టింగ్స్‌ ఆప్షన్‌లో సెట్ చేసుకోవచ్చు.
అంతా బానే ఉంది కానీ..మనిషి శరీరంలో అంత ఎప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే జాకెట్‌ను వేసుకోవడం వల్ల ఆ రేడియేషన్‌ వల్ల వేసుకున్న మహిళ ఆరోగ్యానికి ఏం కాదా అనేది ఆ విద్యార్థులు ప్రస్తావించలేదు..

Read more RELATED
Recommended to you

Latest news