రూ.1కే 1 జీబీ డేటా.. మీకు అర్థ‌మ‌వుతుందా..?

-

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. అయితే ఇప్పుడు జియోకు స‌వాల్ చేస్తూ ఓ బెంగళూరు స్టార్టప్ కంపెనీ. కేవలం రూ.1కే డేటాను అందిస్తామంటోంది. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన వైఫై డబ్బా అనే కంపెనీ వైఫై యాక్సెస్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో ప్లాన్ల కంటే 360 శాతం తక్కువ ధరలకే మీకు ఇది అందుబాటులో ఉండనుంది. దీన్ని మీకు స్థానిక‌ షాపుల్లో వైఫై డబ్బా ప్రతినిధులు తమ రూటర్లను ఉంచుతారు. మీరు కేవలం వాటికి కనెక్ట్ చేసుకుని వైఫైని ఉపయోగించుకోవడమే. అయితే దీనికి కనెక్ట్ చేసుకున్న అనంతరం మీరు మీ వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఇందులో ఉండే ప్లాన్ల ద్వారా మీకు 1 జీబీ డేటాకు కేవలం రూ.1 మాత్రమే ఖర్చు అవుతుంది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ సేవలను అందుకోవడానికి మీకు ఎటువంటి సబ్ స్క్రిప్షన్ చార్జీలు కానీ, సైన్ అప్, ఇన్ స్టాలేషన్ ఫీజులు కానీ ఉండవు. ఇక నగరం మొత్తానికి అందుబాటులోకి వచ్చేందుకు వైఫై డబ్బా సూపర్ నోడ్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించనుంది. వైఫై డబ్బా కేబుల్స్ వేయడానికి రోడ్లు తవ్వక్కర్లేదు, ప్రభుత్వం వద్ద నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయక్కర్లేదు కాబట్టి ఇది తక్కువ ధరకే డేటాను అందించనుంది. ప్రస్తుతానికి ఈ వైఫై డబ్బా కేవలం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి గల యూజర్లు కంపెనీ వెబ్ సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news