గుప్పెడంతమనసు ఎపిసోడ్ 313: జగతితో గొడవ పడుతున్న దేవయాని..ఇంతలో ఫణీంద్ర వచ్చి భార్య పై ఆగ్రహం

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసూ ఉయ్యాల కట్టడానికి చెట్టెక్కబోయి రిషీ మీద పడుతంది కదా..రిషీ నేను ఉయ్యాల కడతాను చూడు అని టక్కుమని చెట్టు ఎక్కుతాడు. ఉయ్యాల కట్టేస్తాడు. ధరణీని కుర్చోపెట్టి రిషీ ఊపుతాడు. ఇంతలో మినిష్టర్ వస్తాడు. మహేంద్ర, ఫణీంద్ర వెళ్లి పలకరిస్తారు. మినిష్టర్ దూరంలో ఉన్న జగతి మేడమ్ కి నమస్కారం చెప్తాడు..ముందున్న దేవయాని ఫస్ట్ తనను పలకరిస్తున్నాడు అనుకుని నమస్కారం చెప్తుంది. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది. అందరిని ముందుండి నడిపిస్తున్న మీరు వెనుకు నిలబడ్డారేంటి అని ముందుకు రమ్మని అక్కడున్న వారికి జగతి గొప్పతనాన్ని చెప్తాడు. దేవయానకి కాల్తా ఉంటుంది. మినిష్టర్ రిషీ గురించి అడిగేసరికి వచ్చారు సార్ పిలుచుకువస్తా అని వెళ్తాడు. రిషీ ధరణీని ఉయ్యాలలో అలా ఊపుతూ ఉండటం చూసి..మహేంద్ర ఆ ప్లేస్ లో వసూని ఊహించుకుంటాడు. ఈ ఊహ ఎంత బాగుంది..నిజమైతే బాగుండు అనుకుంటాడు. మహేంద్ర రిషీ వాళ్ల దగ్గరకు వెళ్తాడు. రిషీ, ధరణీ ఇదంతా బాగుంది అంటారు. వసుందార జగతి, మహేంద్ర ఊయల ఊగుతున్నట్లు ఇమాజిన్ చేసుకుంటుంది. మహేంద్ర వాళ్ల అందరిని మినిష్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు.

ఆ మినిష్టర్ రిషీ వాళ్లతో కబుర్లు చెప్పుకుంటాడు. పుష్పా వసూతో ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తుంది. దూరం నుంచి రిషీ చూసి అక్కడనుంచి వచ్చేస్తాడు. వసూ వెనకే వెళ్తాడు. వసూ ఆటో ఎక్కబోతుంటే..రిషీ ఆపుతాడు, ఎక్కడకు వెళ్తున్నావు అంటే..ఇస్త్రాకులు మర్చిపోయారు అంట తీసుకురావటానికి వెళ్తున్నా అంటుంది. రిషీ నేను వస్తా అంటాడు. వసూ వద్దని చెప్పినా రిషీ కూడా ఆటోలో వెళ్తాడు.

ఉయ్యాలలో ధరణీ, జగతీ ఊగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జగతిని ధరణి ఉయ్యాల ఊపడం దేవయాని చూసి..ధరణీ అని గట్టిగా అరుస్తుంది. ఇళ్లు దాటొస్తే ఒళ్లు మర్చిపోతావా, ఇలా పళ్లు ఇకిలిసిత్తూ.. నవ్వుకుంటూ తుళ్లుకుంటూ తిరగొచ్చా, కొత్తవాళ్లతో స్నేహాలు మొదలై నీకు కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయా అంటుంది. జగతి హాయిగా నవ్వుతుంటే సంతోషించాలి అత్తయ్య, ఇలా కుళ్లుకోకూడదు అంటుంది. దేవయాని ధరణీని కూడా నీలాగే తయారుచేస్తున్నావా, అత్తారింట్లో గొడవలు పెట్టుకుని నీలాగే గడపదాటేలా చేస్తున్నావా అంటుంది. జగతి అక్కయ్య మర్యాదగా మాట్లాడండి అంటుంది. దేవయాని జగతిని తిడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర, ఫణీంద్ర చూస్తారు. ఫణీంద్ర వెళ్లి ఏం జరుగుతుంది దేవయాని అరుస్తాడు. దేవయాని ధరణికి జగతి కొత్త ఆలోచనలు నూరిపోస్తుంది..తప్పమ్మా అలా చేయొద్దని జగతికి చెప్తాను అంటుంది. నేను అలా మాట్లాడలేదని జగతి అనటంతో..ఎవరు అలా మాట్లాడతారో నాకు తెలుసు, మినిష్టర్ గారి అతిథిలుగా వచ్చామ్, దయచేసి పరువు తీయొద్దు అని కసురుకుంటాడు.

ఇంకోవైపు ఆటోలో రిషీ, వసూలు వస్తుంటారు. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నా సార్ అంటుంది వసూ. నువ్వు ప్రతిసారి నన్ను స్పెషల్ గా చూడకు అని రిషీ అంటాడు. అలా అలా ఆ గురుకు ఆటోలో ఒకరినొకరు టచ్ చేసుకుంటూ కళ్లళ్లో కళ్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. మినిష్టర్ పక్కన రిషీ కుర్చుంటాడు. మినిష్టర్ జగతి మేడమ్ ని పిలవడంతో జగతి రిషీ పక్కన కుర్చుంటుంది. జగతి పక్కన మహేంద్ర. ఫ్యామిలీ అంతా అలా అనుకోకుండా కలిసి పక్కపక్కనే కుర్చోని తింటారు. అది కాస్తా వసుధార ఫొటో తీస్తుంది. రిషీ సీరియస్ గా చూస్తాడు. చూద్దాం రిషీ స్పందన ఎలా ఉంటుందో..!

Read more RELATED
Recommended to you

Latest news