మహిళల కోసం మోడీ సర్కార్ మరో అద్భుతమైన స్కీమ్..పూర్తి వివరాలు..

-

మహిళలు ఇప్పుడు అన్నింట్లోను రానిస్తున్నారు.. ముఖ్యంగా పలు వ్యాపారాలలో ఆడవాళ్లదే రాజ్యం.. అందుకే మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..ఇందులో మహిళలు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకం తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని అందిస్తుంది..బడ్జెట్ 2023లో ప్రకటన తర్వాత.. ఈ పథకం నోటిఫికేషన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడింది. అంటే ఇప్పుడు మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కేవలం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది..

 

ఈ పథకం ప్రయోజనాల విషయానికొస్తే..మహిళలు లేదా సంరక్షకులు మాత్రమే మైనర్ పేరుతో ఖాతాను తెరవగలరు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రెండేండ్ల వరకు అంటే 2025 మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు.. ఈ పథకంలో వడ్డీ మూడు నెలలకొకసారి యాడ్ అవుతుంది..మెచ్యూరిటీ లోగ ప్లాన్ ను మూసివేసే అవకాశాలు లేవు..కాగా,ఖాతాదారుడు మరణిస్తే దాన్ని మూసివేయవచ్చు. ఇది కాకుండా ఇతర పరిస్థితులలో, ప్రభుత్వం అంగీకరిస్తే, అప్పుడు ఖాతాను మూసివేయవచ్చు. ప్రీమెచ్యూర్ ఖాతాను 6 నెలల తర్వాత మాత్రమే మూసివేయవచ్చు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అందులో ఫారం-2 నింపాలి. మైనర్‌లు ఫారం-3ని పూరించగలరు. 1 సంవత్సరం తర్వాత, 40% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇకపోతే ఒక మహిళ ఈ పథకంలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, ఆమెకు 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఈ మొత్తాన్ని 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ మొత్తం మూడు నెలల తర్వాత ఖాతాలో వేస్తారు. దీని ప్రకారం రెండేళ్లలో మహిళలకు రూ.2.32 లక్షలు జమ చేస్తారు.ప్రస్తుతం ఈ పథకం కేవలం పోస్టాఫీసు లకు మాత్రమే పరిమితం చేశారు..మరి బ్యాంకులలో ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news