ఇక మేఘాల్లో కూర్చుని భోజనం చేయొచ్చు.. హైదరాబాద్ లోనే..

-

అవును.. అలా గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి కిందకు చూస్తే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదూ. మరి అలాంటి ఫీలింగ్ రావాలంటే.. విమానమెక్కాలి..లేదా.. ఎత్తైన కొండ శిఖరాలు ఎక్కాలి. కానీ అవేమీ లేకుండానే మహానగరాన్ని పక్షిలా చూసేయొచ్చు. అంతే కాదు.. అక్కడే మేఘాల్లోనే కూర్చుని హాయిగా విందు ఆరగించొచ్చు.

ఇప్పుడు ఈ సౌకర్యం హైదరాబాద్ లోనూ అందుబాటులోకి వచ్చేసింది. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదుట ఏర్పాటు చేసిన క్లౌడ్ డైనింగ్ రెస్టారెంటు నవంబర్ 1న ప్రారంభం అవుతోంది. ఈ విషయాన్ని రెస్టారెంట్ ఎండీ దేవీదత్ కోలి తెలిపారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ క్లౌడ్ డైనింగను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

ఈ క్లౌడ్ డైనింగ్ 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ వేలాడే రెస్టారెంటులో పసందైన భోజనం ఆరగించే అవకాశం ఉంది. అయితే క్లౌడ్ డైనింగ్ చేయాలనుకునేవారు వైబ్ సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. రేటు కాస్త ఎక్కువగానే ఉన్నా.. ఆకాశంలో భోజనం చేయడం అనే థ్రిల్లింగ్ ముందు అదేమంత ఎక్కువ కాదంటున్నారు నిర్వాహకులు.

Read more RELATED
Recommended to you

Latest news