అడ్మిషన్స్ కోసం ఆధార్ ను ఇస్తున్నారా?..ఇది ఒకసారి చూడండి..

-

ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ తప్పనిసరి అయ్యింది.ఈ క్రమంలో కొన్ని సార్లు మోసాలకు కూడా గురయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు పదే పదే చెబుతున్నారు.ఇలా చాలా మంది మోసపోయారు కూడా. అయితే స్కూల్స్ లో అడ్మిషన్లలో ఆధార్ను తప్పనిసరి చేయలేమని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, చాలా పాఠశాలలు ఇప్పటికీ చి ఉండటం వరకు చిన్నారుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

 

ఇక అన్ని చోట్ల ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదు. సంబంధించి యూనిక్ ఐడెండిటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం…భారత దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా 12-అంకెల, బయోమెట్రిక్ ఆధారిత, ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన ఆధార్ను యూఐడీఏఐ జారీ చేస్తుంది.నవజాత శిశువుతో సహా ఏ వయసులోనైనా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉంటే ఎన్నో అంశాలలో గుర్తింపు కార్డుగా ఇది ఉపయోగపడుతుంది.అయితే పాఠశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆధార్ ఇవ్వాల్సిన పని లేదని యూఐడీఏఐ చెబుతోంది.సీబీఎస్‌ఈ, నీట్, యూజీసీ నిర్వహించే పరీక్షలకు సైతం ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదని యూఐడీఏఐ పేర్కొంది.ఏదైనా విద్యాసంస్థలు ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలని పట్టుబడితే వారిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ చేయించరు.అలాంటి పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియను పాఠశాలలే చేపట్టానే నిబంధనను యూఐడీఏఐ పొందుపర్చింది..పరీక్షలు రాయడానికి, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి, కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి ఆధార్ తప్పనిసరి కాదు. విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలి.తప్పనిసరి చేస్తే అది నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news