పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. ఈ సమస్యలపై తగ్గేదెలే..!!

-

టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటి అయ్యారు. అమరావతిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యచరణ, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు రైతుల సమస్యలపై ఉద్యమించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇటీవల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. రైతులకు అండగా ఉంటూ రైతు పోరుబాట పేరిట టీడీపీ బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగింపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సదస్సులు నిర్వహించనుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరుబాట పేరిట టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. సీఎం సొంత జిల్లా కడప నుంచే టీడీపీ పోరుబాట సదస్సు ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 20న కడప, 25న నెల్లూరు, జులై 1న కాకినాడ, జులై 7న విజయనగరం, జులై 13న విజయవాడలో రైతు పోరుబాట సదస్సులు జరుగుతాయన్నారు. రైతులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలన్నారు. సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news