పరుగులు పెడుతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఇలా..!

-

బంగారం ధరలు దూసుకెళ్ళిపోతున్నాయి. ఈరోజు కూడ బంగారం ధరలు పెరిగాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గత రెండు రోజుల నుండి బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు కూడా ధరలు పెరిగాయి. దీనితో కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పాలి. ఇక వీటి ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే..

బంగారం ధరలు పైకి కదిలాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో రేటు రూ.50,300కు బంగారం చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇలానే వుంది. రూ.200 పెరుగుదలతో రూ.46,100కు ఎగసింది.

ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. 0.03 శాతం తగ్గింది బంగారం. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1904 డాలర్లకు క్షీణించింది. వెండి కూడా ఇలానే వుంది. ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 28.03 డాలర్లకు వెండి తగ్గింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ మొదలైన వాటి కారణంగా పసిడి రేటుపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news