క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫ‌ర్‌..

-

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తమ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ అందించింది. ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చే ఆఫర్లకు ధీటుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పండగ సీజన్‌లో షాపింగ్‌లో ఖర్చు కోసం డెబిట్‌ కార్డును వాడుకుని.. ఖర్చైన మొత్తాన్ని వాయిదాలుగా (ఈఎంఐలు) చెల్లించవచ్చని ప్రకటించింది. సోమవారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని తెలిపింది.

ఆరు నుంచి 18 నెలల మధ్యలో వాయిదాల కాలాన్ని ఎంచుకోవచ్చని, దేశవ్యాప్తంగా 1500 నగరాల్లోని 40 వేలకు పైగా విక్రేతల వద్ద ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇందుకోసం ఏవిధమైన పత్రాలు కానీ, ప్రాసెసింగ్‌ ఫీజును కానీ చెల్లించనవసరం లేదని, ఎంపిక చేసిన బ్రాండ్లపై వడ్డీలేని వాయిదాలు కూడా ఉంటాయని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news