కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పేటీఎం..!

-

మీరు మీ డబ్బులని ఎక్కడైనా దాచుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు బంపర్ ఆఫర్.
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం కస్టమర్లకు శుభవార్త అందించింది. పేటీఎం మరో బ్యాంక్ ‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. అయితే దీని కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు బెనిఫిట్స్ ని అందించనుంది.

paytm
paytm

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందుబాటు లోకి తీసుకు రావడానికి సిద్ధం అయ్యింది. దీనికి గల కారణం ఏమిటి అంటే..? పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ PPBL తాజాగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో జతకట్టింది. దీనితో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందుబాటు లోకి రానున్నాయి.
ఇది ఇలా ఉండగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటికే ఇండస్ఇండ్ బ్యాంక్‌తో కలిసి కస్టమర్లకు FD సేవలు అందిస్తోంది.

మరో విశేషం ఏమిటంటే మల్టీపుల్ పార్టనర్ ఎఫ్‌డీ సర్వీసులు అందిస్తున్న దేశీ తొలి పేమెంట్స్ బ్యాంక్‌గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఇండస్ఇండ్ బ్యాంక్ లేదా సూర్యోదయ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు పొందొచ్చు. అలానే పేటీఎం ద్వారా ఈ రెండు బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే జీరో పెనాల్టీ చార్జీల బెనిఫిట్ పొందొచ్చు. కస్టమర్లు ఎఫ్‌డీలను పోల్చి చూసుకోవచ్చు. ఏమైనా అంశాలని పోల్చి చూసుకొని నచ్చిన బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓపెన్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news