స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి ముఖ్యమైన అలర్ట్…..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా…? అయితే ఈ ముఖ్యమైన ఎలర్ట్ గురించి తప్పక మీరు తెలుసుకోవాలి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కోసం ఓ విషయం పై హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల కాలం లో ఎక్కడ చూసిన మోసాలు కనిపిస్తున్నాయి. అందు కోసం మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని అలర్ట్ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాయ మాటలు చెప్పి డబ్బులని దోచుకోవడం… ఇలా అనేక రకాల స్టోరీలతో డబ్బులని కాజేస్తున్నారు.

Image

అందు కోసమేఈ ఎలర్ట్ ని అందించింది. మోసగాళ్లు సోషల్ మీడియా లో మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారని వీటితో జాగ్రత్తగా ఉండాలని.. మోసగాళ్ల ఉచ్చు లో తమ ఖాతాదారులను పడవద్దని హెచ్చరించింది ఈ బ్యాంక్. అనేక ఫేక్ మెస్సేజెస్ ఫోన్ల కి పంపిస్తూ మోసాలు చేస్తున్నారని… వాటికి దూరంగా ఉండాలంది.

కస్టమర్లు సోషల్ మీడియా లో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం అంటూ దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఫేక్ మెసేజ్‌ల బారిన పడొద్దు అని చెప్పడమే కాక… తప్పుదోవ పట్టించే మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని… లేకపోతే మీ ఎకౌంట్ సున్నా అయిపోతుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news