పోస్టాఫీసు స్కీమ్.. రోజుకు రూ.70 కడితే..రూ. 10 లక్షలు పొందే అవకాశం..

-

ప్రజల కోసం పోస్టాఫీసు ఎన్నో స్కీమ్ లను అందుబాటులో కి తీసుకొచ్చింది..పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ఈ ప్లాన్ పేరు యుగల్ సురక్ష. ఈ ప్లాన్‌లో, మీరు ప్రతి నెలా రూ.2021 అంటే రోజుకు 70 రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ10 లక్షల బెనిఫిట్ ను పొందవచ్చు..భార్యాభర్తలకు కలిసి కవరేజీ ఇచ్చే ప్లాన్ ఇది. అంటే భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లాన్‌లో కవర్ అవుతారు. పాలసీ సమయంలో ఇద్దరూ జీవిత బీమా ప్రయోజనం పొందుతారు. యుగల్ సురక్ష అని పిలిచే ఈ పాలసీలో, మెచ్యూరిటీపై మొత్తం హామీ, బోనస్ అందిస్తారు.

పాలసీ సమయంలో జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే, బీమా మొత్తం, బోనస్‌తో కలిపి భాగస్వామికి మరణ ప్రయోజనం అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ పాలసీని తీసుకోలేరు. కానీ, చాలా మంది ప్రజలు దీనిని తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, CAలు, న్యాయవాదులు లేదా బ్యాంకర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఉద్యోగులు ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు..వివరంగా చెప్పాలంటే స్కీమ్ లో చేరినప్పటి నుంచి 20 ఏళ్లు ఉండాలి..

పాలసి వ్యవదిలో పాలసి దారులు ప్రమాదం వల్ల చని పోతే..ఇతర జీవిత భాగస్వామి మరణ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో, 5 లక్షల సమ్ అష్యూర్డ్, దానితో పాటు చేసిన బోనస్ మొత్తం అందిస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరిలో ఎవరైనా చనిపోయారని అనుకుందాం. ఆ తర్వాత మరొక జీవిత భాగస్వామికి 5 లక్షల సమ్ అష్యూర్డ్, బోనస్ రూ. 1,30,000లను సంవత్సరానికి 26,000 చొప్పున 5 సంవత్సరాల వరకు అందిస్తారు. ఈ విధంగా, 5 సంవత్సరాల తర్వాత మరణ ప్రయోజనంగా 6,30,000 రూపాయలు పొందుతారు..

Read more RELATED
Recommended to you

Latest news