బాక్సాఫీస్ వద్ద మళ్ళీ పోటీ పడబోతున్న మహేష్ బాబు .. అల్లు అర్జున్ ..?

-

2020 ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ హిట్స్ ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజైన సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు తో భారీ కమర్షియల్ హిట్ ని సాధిస్తే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ సాధించాడు. సంక్రాంతి రేసులో వసూళ్ళ సునామీని సృష్ఠించాడు అల్లు అర్జున్.

 

చెప్పాలంటే 2020 సంక్రాంతికి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్, నందమూరి కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా కూడా పోటీ పడ్డాయి. కాని ఒక్క బొమ్మ పడగానే ఆ సినిమాలు సర్ధుకున్నాయి. కాని ఈ రెండు సినిమాలు రికార్డ్స్ ని సాధించాయి. దాంతో ఇండస్ట్రీకి 2020 ప్రారంభం అదిరిపోయింది. ఇక మరోసారి ఈ టాలీవుడ్ స్టార్స్ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ కి జంటగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న నటిస్తుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక మహేష్ బాబు పరుశురాం కాంబోలో తయారవబోతున్న సర్కారు వారి పాట కూడా 2021 సమ్మర్ కి రిలీజ్ చేయాలని యూనిట్ ప్రణాళిక సిద్దం చేసుకున్నారట. దీంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news