కడపలో వర్గ పోరు..ఒకరు మృతి..!

-

రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కడపలో చోటుచేసుకుంది. కడప మున్సిపల్ మైదానం దగ్గర కూరగాయల దుకాణదారుల మధ్య ఓ విషయంలో ఏర్పడిన గొడవ కర్రలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కొందరిని అరెస్టు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news