టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న కపట రాజకీయాలకు కాలం చెల్లిందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని స్పష్టంచేశారు. స్థానిక తన కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజిని శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె. అచ్చన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ హయాంలో అడ్డగోలు అవనీతికి పాల్పడ్డారని తెలిపారు. దాదాపు రూ.150 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టు ఏసీబీ అధికారుల వద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయని చెప్పారు. విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డవారిని అరెస్టు చేయక సత్కరిస్తారా..? అని ప్రశ్నించారు. మోసం చేసిన అచ్చెన్నాయుడును చట్టం ప్రకారం అరెస్టు చేస్తే.. ఇదేదో బీసీలను అణగదొక్కే చర్యగా, బీసీలకు ద్రోహం చేస్తున్నట్లుగా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఆ పార్టీ నాయకులంతా కులం రంగుపులమాలని తెగ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
బాబూ.. నీ కపట రాజకీయాలకు కాలం చెల్లింది..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ పాకెట్లో పర్సు పెట్టుకుంటున్నారా..?
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, కుర్చున్నప్పుడు చాలా మంది బ్యాక్ పాకెట్లో పర్సును పెట్టుకుంటారు....
T20 World Cup 2024: ఆస్ట్రేలియా టీమ్ ప్రకటన…కెప్టెన్ ఎవరంటే..?
Australia Announce T20 World Cup Squad: T20 World Cup...
వేప, బెల్లం ఉపయోగించి సిమెంట్ లేకుండా 2000 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం
అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో దేశవ్యాప్తంగా వేడిగాలులు...