తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

-

తెలంగాణలో కరోనా తన తీవ్రతను పెంచినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఊహించని రీతిలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతుంది. నిన్న, మొన్నటి దాకా సామాన్య ప్రజలను వణికించిన కరోనా ఈ మధ్య రాజకీయ నాయకులను కూడా వణికించడం మొదలుపెట్టింది. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారినపడ్డారు. ఆయనకి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కరోనా సోకిన రెండో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.

Read more RELATED
Recommended to you

Latest news