అమెరికాలో ఘర్షణల సెగలు ఇంకా చల్లారడం లేదు.. గత నెల రోజులుగా అమెరికా లో ఎన్నడూ లేని స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. వారి దేశాన్ని ఓ పక్క కరోనా పీల్చి పిప్పి చేస్తుంటే మరోపక్క తమకు తామే క్రైమ్ రేట్ ను పెంచుకుంటున్నారు. అమెరికాలోని మెన్నేయపొలీస్ నగరంలో జార్జ్ ఫ్లయిడ్ హత్యతో మొదలైన అల్లర్లు ఇప్పటికీ కూడా సద్దుమనగడం లేదు. అక్కడి ప్రజలు పోలీసులకే చుక్కలు చూపుతున్నారు..! తాజాగా నిన్న రాత్రి 12.30 ప్రాంతంలో అక్కడ విషాద ఛాయలు అలమటించాయి.. కాల్పుల కలకలం రక్తపు మరకలు ఫేస్ బుక్ లైవ్ లో రికార్డ్ అయ్యాయి. కొందరు గుర్తుతెలియని దుండగులు అక్కాడికి చేరుకొని అక్కడ ఉన్న పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులు వచ్చే లోపే దుండగులు అక్కడనుండి పరారయ్యారు.
అమెరికాలో రక్త విధ్వంసం..! అడ్డొచ్చిన వారిని కాల్చిపడేశారు..!
By anurag s
-
Read more RELATEDRecommended to you
BREAKING : తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్ అమలు
తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు...
BREAKING : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్లిన ఓ కారు...
Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి
Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి చేశారు. ఈ...