గాల్వన్ లోయలో ఇటీవలే భారత్, చైనా జవాన్లు పరస్పరం దాడి చేసుకోగా.. ఆ దాడిలో భారత్కు చెందిన 20 మంది జవాన్లు మృతి చెందారు. అయితే చైనా మాత్రం తమ జవాన్లు ఎంత మంది చనిపోయింది ఇప్పటి వరకు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆ దాడిలో 40 మంది వరకు చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ దాడిలో మొత్తం 55 మంది చైనా సైనికులు చనిపోయారని, వారి లిస్ట్ ఇదే.. అంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఇంతకీ అసలు ఇందులో నిజం ఉందా..? అంటే..
భారత్తో గాల్వన్ లోయలో జరిగిన దాడిలో చనిపోయిన 55 మంది చైనా సైనికుల జాబితా ఇదే.. అంటూ ప్రచారంలో ఉన్న ఆ లిస్ట్ నకిలీదని తేలింది. వారు చైనా సైనికులే.. కానీ వారు ప్రస్తుతం దాడిలో చనిపోయిన వారు కాదు. గతంలో కొరియాతో జరిగిన యుద్ధంలో చనిపోయిన చైనా జవాన్ల లిస్టు అది. ఆ జాబితా వికీపీడియాలో ఉంది. దాన్ని కాపీ చేసి ప్రస్తుత దాడికి లింక్ చేసి ఆ జాబితాను ప్రచారం చేస్తున్నారు. కనుక ఆ జాబితా ఫేక్ అని తేలింది.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో చాలా వరకు ఫేక్ వార్తలే ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. కనుక ఎవరూ తమకు వచ్చే వార్తలను నమ్మకూడదు. అవి నిజమా, కాదా అని నిర్దారణ చేసుకోవాలి.