జీప్ మీద ఒకవైపు నేను.. మరోవైపు చిరుత: క‌రీష్మా క‌పూర్

-

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్లు చాలా వరకు డూప్స్ లేకుండానే స్వతహాగా సంట్స్ చేస్తున్నారు. ఒక్కోసారి వారు షూటింగ్లు చేసే ఫీట్స్ చూస్తే ప్రేక్షకులకు ఇది నిజమా? అబద్దమా? అన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా హీరోలకు దీటుగా సాహసాలు చేసేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన నటించిన షూటింగ్ సమయంలో చిరుత పులి తో కలిసి ఓ ఫోటో దిగింది. ఆ ఫోటో ని చూసిన కరీనా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.

karisma
karisma

ఇకపోతే తాను ఇంతకు ముందు షికారి సినిమా షూటింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో జరిగిన షూటింగ్ సమయంలో ఓ చిరుత కరిష్మా దగ్గరకు చేరుకుంది. అయితే అప్పుడు తీసిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది కరిష్మా కపూర్. ఇంస్టాగ్రామ్ లో తన అధికారిక ఖాతా ద్వారా ఈ ఫోటోని షేర్ చేస్తూ అందుకు ” జీపు మీద ఒక వైపు నేను… మరో వైపు చిరుత ” అంటూ క్యాప్షన్ ని జత చేసి పోస్ట్ చేసింది. ఆ సమయంలో నాకు కాస్త భయం వేసింది కానీ, ఆ క్షణాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తెలియజేసింది అందాలభామ.

Read more RELATED
Recommended to you

Latest news