దెయ్యం పిలిచింది.. యువతి ఆత్మహత్య చేసుకుంది..!

-

దిండుక్కల్ జిల్లాకి చెందిన ఓ యువతి కోయంబత్తూర్‌ ప్రభుత్వ కాలేజీలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉన్న ఆ యువతి.. ఇటీవలే పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడని ఆ యువతి.. శుక్రవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

సూసైడ్ నోట్ లో ‘రాత్రి నిద్ర పట్టడం లేదు. చనిపోయేందుకు రావాలని నన్ను ఎవరో పిలుస్తున్నారు. దీని గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తానని ఓ దెయ్యం నన్ను భయపెడుతోంది’ అని రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. దీనిపై అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news