అమర జవాన్ కుటుంబానికి హై కోర్టు జోక్యంతో న్యాయం

-

ఏడేళ్ల క్రితం జమ్ముకశ్మీర్​లో పాకిస్తాన్ కాల్పుల్లో అమరుడైన లాన్స్​నాయక్ మహమ్మద్ ఫిరోజ్​ఖాన్​కు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం చెల్లించింది. అమరజవాను భార్య బ్యాంకు ఖాతాలో గత నెల 31న రూ.29 లక్షలు జమచేసినట్టు హైకోర్టుకు సర్కారు నివేదించింది.

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా సరిహద్దుల్లో 2013లో జరిగిన కాల్పుల్లో లాన్స్​నాయక్ వీరమరణం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.29 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా చెల్లించడం లేదని.. ఫిరోజ్​ఖాన్ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని వివరిస్తూ న్యాయవాది పవన్​కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. పరిహారం చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలపాలని జీఏడీ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, హైదరాబాద్ కలెక్టర్​కు గత నెల 27న హైకోర్టు నోటీసులు జారీచేసింది.

ఈ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా గత నెల 31న అమరుడి భార్య బ్యాంకు ఖాతాలో రూ.29 లక్షలు జమచేసినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతైనా ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిరోజ్​ఖాన్​ భార్య బ్యాంకు ఖాతాకు రూ.29 లక్షల రూపాయలు బదిలీ అయినట్టు ఈనెల 19లోగా ఆధారాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news