దీపావళి ఆఫర్: మొబైల్ బుక్ చేస్తే బట్టల సబ్బు వచ్చింది..!

-

Man gets detergent bar rather than mobile through online booking

ఈకామర్స్ సంస్థలు పండుగ ఆఫర్లు అంటూ ఎలా ఊరిస్తాయో తెలుసు కదా. దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్, సంక్రాంతి ఆఫర్లు.. ఇలా ప్రతి పండుగకు డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి ఈకామర్స్ సంస్థలు. తాజాగా దీపావళి ఆఫర్లు ప్రకటించిన ఓ ఆన్ లైన్ సంస్థ.. మొబైల్ కు బదులు బట్టల సబ్బు పంపించింది.

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకున్నది. చేవెళ్లకు చెందిన ఓ యువకుడు ఓ ఈకామర్స్ సంస్థ నుంచి స్మార్ట్ ఫోన్ బుక్ చేశాడు. డబ్బులు ఆన్ లైన్ చెల్లించలేదు కానీ.. సీవోడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు. సీవోడీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్నమాట. సో.. కోరియర్ బాయ్ ఆ యువకుడి అడ్రస్ కు వచ్చాడు. చెల్లించాల్సిన డబ్బులు చెల్లించి ఆ యువకుడు పార్సిల్ తీసుకున్నాడు. తర్వాత తాపీగా మనోడు పార్సిల్ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే.. అందులో ఫోన్ లేదు గీన్ లేదు. బట్టల సబ్బు ముక్కలు ఉన్నాయి. దీంతో లబోదిబోమన్నాడు ఆ వ్యక్తి. 16 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొటే 10 రూపాయల విలువైన బట్టల సబ్బు పంపించారని బోరుమన్నాడు. వెంటనే ఆ డెలివరీ బాయ్ కి ఫోన్ చేసినప్పటికీ అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. ఇప్పుడు ఎవరికి నా బాధ చెప్పుకోవాలంటూ బావురుమంటున్నాడు ఆ యువకుడు.

Read more RELATED
Recommended to you

Latest news